ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తక్షణమే రద్దు చేయాలి – జనసేన

తిరుపతి: రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దు చేయాలని న్యాయవాదులు గత కొంతకాలంగా చేస్తున్న దీక్షకు మద్దతుగా సోమవారం తిరుపతి జనసేన పార్టీ ఇన్చార్జ్ కిరణ్, రాయల్ నగర అధ్యక్షుడు రాజారెడ్డి లు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా కిరణ్ మాట్లాడుతూ ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయాలని న్యాయవాదులే దీక్ష చేపట్టారంటే దీన్ని ప్రభుత్వం పునరాలోచించుకోవాలని, తక్షణమే ఇలాంటి చట్టాలను రద్దు చేయాలని, రద్దు చేసే వరకు జనసేన పార్టీ న్యాయవాదులకు ప్రజలకు అండగా నిలుస్తుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రాజేష్ ఆచారి, మనోజ్, షరీఫ్ తదితరులు న్యాయవాదులతో కలిసి పాల్గొన్నారు.