వలస కార్మికులకు, దివ్యాంగులకు దుప్పట్లు పంపిణీ

అమలాపురం: అయోధ్య శ్రీరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ట సందర్భంగా వలస కార్మికులకు, దివ్యాంగులకు కొంతమంది దాతలు మరియు చిందాడగరువు ఎం.పి.టి.సి మోటూరి కనకదుర్గ, వెంకటేశ్వరరావు దంపతుల సహాయంతో వారి సారధ్యంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో కోనసీమ జిల్లా కలెక్టర్ హిమాన్ష్ శుక్లా ఆధ్వర్యంలో దుప్పట్లు పంచిపెట్టే కార్యక్రమం కలెక్టర్ గారి చేతుల మీదుగా అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ మోటూరి దంపతులు చేస్తున్న సేవ అభినందనీయమని ముందు ఇలాంటి సేవలు ఎన్నో చేయాలని మోటూరి దంపతులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి సిహెచ్ సత్తిబాబు ఏవో విశ్వేశ్వరరావు, డీఎంహెచ్వో, కలెక్టర్ కార్యాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.