హరిరామజోగయ్యని కలిసిన గురాన అయ్యలు

విజయనగరం: మాజీ మంత్రి చేగొండి హరిరామజోగయ్యను పాలకొల్లులో మంగళవారం ఆయన నివాసంలో జనసేన నేత గురాన అయ్యలు మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రస్తుత రాజకీయ అంశాలు, విజయనగరం జిల్లాలో నెలకొన్న పరిస్థితులపై వారు సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా హరిరామజోగయ్య ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుత పరిస్థితులు, ఓటర్ల అవగాహనలను ప్రభావితం చేసే ముఖ్యమైన అంశాలపై తన అభిప్రాయాలను తెలియజేశారు.