సీతారామపురం తండాలో 40 కుటుంబాలు జనసేన పార్టీలో చేరిక

వినుకొండ: నియోజకవర్గంలో వైసీపీ అసమర్థ పాలనకు విసిగిపోయిన బొల్లాపల్లి మండలం, సీతారామపురం తండా గ్రామనికి చెందిన 40(ఎస్ టి)సుగాలి కుటుంబాలు వైసీపీ పార్టీనీ వీడి వినుకొండ జనసేన పార్టీ సమన్వయ కర్త నాగశ్రీను ఆధ్వర్యంలో జనసేన పార్టీలో జాయిన్ అయ్యారు. వీరందరికీ ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా గాదె వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. జనసేన పార్టీనీ నమ్మి పార్టీలోకి వచ్చిన ప్రతి ఒక్కరికీ శుభాకాంక్షలు. వైసీపీ అరాచక పాలనకు తట్టుకోలేని సామాన్యులు ఒక మంచి నిర్ణయంతో పార్టీలోకి రావటం చాలా ఆనందంగా ఉంది. వైసీపీకి బలమైన గ్రామంగా పేరు ఉన్న సీతారామపురం తండా నుంచి 40 సుగాలి కుటుంబాలు పార్టీలో జాయిన్ అయ్యారు అంటే నియోజకవర్గంలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారు అని అర్దం అవుతుంది. పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికీ సముచిత స్థానం కల్పిస్తాం. సంక్షేమ పథకాల పేరుతో అభివృద్ధిని గాలికి వదిలేసి రాష్ట్రాన్ని అప్పుల ఉభిలోకి తీసుకెళ్ళాడు ఈ ముఖ్యమంత్రి. మన రాష్ట్రన్ని అభివృద్ధి పథంలో చూడాలి అంటే రాబోయే ఎన్నికల్లో జనసేన – తెలుగుదేశం పార్టీల ఉమ్మడి ప్రభుత్వ ఏర్పాటుకు ప్రజలంతా సహకరించాలి అని అన్నారు.