జనసేన నేతల హౌస్ అరెస్ట్
- ఈరోజు ప్రతిపక్షాలను అడ్డుకుంటున్నారు
- రేపు మళ్లీ అధికారంలోకి వస్తే ప్రజలనుకూడా అడ్డుకుంటారు – జనసేన
తిరుపతి సిటీ: తిరుపతిలో సాయంత్రం ఎప్పుడో జగన్మోహన్ రెడ్డి ప్రోగ్రాం ఉంటే ఉదయం ఆరు గంటల నుంచి జనసేన పార్టీ నేతలను హౌస్ అరెస్టు చేయడం ఏంటని, జగన్ రెడ్డి తీరు చూస్తుంటే జనసేన అంటే భాగా భయమని అర్థమవుతుందని, నగర అధ్యక్షుడు రాజారెడ్డి, రాష్ట్ర కార్యదర్శి సుభాషిని జనశ్రేణుల అరెస్టులతో ఆ పార్టీ తిరుపతి ఇంచార్జ్ కిరణ్ రాయల్ బుధవారం అధికార పార్టీపై మండిపడ్డారు. ఈరోజు ప్రతిపక్షాలను అడ్డుకుంటున్నారు, రేపు మళ్లీ అధికారంలోకి వస్తే ప్రజలనుకూడా రోడ్లపై తిరగకుండా అడ్డుకుంటారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2024/01/netala-1024x576.jpg)