అమరావతి రైతుల మహోద్యమానికి గాదె సంఘీభావం

గుంటూరు: అమరావతి రాజధాని పరిరక్షణ మహోఉద్యమం నేటితో 1500 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా అమరావతి సమర శంఖారావం వెలగపూడి దీక్ష శిబిరంలో మరియు మందడం దీక్ష శిబిరంలో పాల్గొన్న జనసేన పార్టీ ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు వారికి మద్దతు తెలిపి సంఘీభావం తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు అడపా మాణిక్యాలరావు, శిఖా బాలు, తుళ్ళూరు మండల అధ్యక్షులు యర్రగోపుల నాగరాజు, మండల ప్రధాన కార్యదర్శి కుప్పాల సుబ్బారావు, వల్లంశెట్టి శ్రీధర్, నాగభూషనం, యడ్ల వెంకటేశ్వరరావు, చింత శివ, హుస్సేన్, పతెళ్ళ మల్లి, పలకాయల కృష్ణయ్య, గొచిపాత కిషోర్, బండి సునీల్ తదితరులు.