వసంతయ్యకి ఘన నివాళులు అర్పించిన యల్లటూరు శ్రీనివాస రాజు
రాజంపేట: ఉమ్మడి కడప జిల్లా రాజంపేట ఎస్.ఎర్రపల్లె గ్రామానికి చెందిన ఎన్.ఆర్.ఐ పిండిబోయిన వసంతయ్య స్వర్గస్తులయ్యారని విషయం తెలిసిన రాజంపేట జనసేన నేత యల్లటూరు శ్రీనివాస రాజు వారి భౌతికకాయాన్ని సందర్శించి పూలమా వేసి నివాళులర్పించారు. వారి వెంట జనసేన పార్టీ నాయకులు శింగంశెట్టి నరేంద్ర, మాజీ జెడ్పీటీసి యల్లటూరు శివరామరాజు, బలిజ పల్లె గంగమ్మ జాతర చైర్మన్ ఎరుకొండు నరసింహులు, కాపు నాయకులు ఆకుల చలపతి, యువ నాయకులు రాజేష్ వర్మ, సాయి రాజు తదితరులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2024/01/WhatsApp-Image-2024-01-25-at-2.51.52-PM-1024x768.jpeg)