కందుల దుర్గేష్ కు బత్తుల పరామర్శ

  • కందుల ఉషారాణి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన బత్తుల

రాజమండ్రి: తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు కందుల దుర్గేష్ సతీమణి శ్రీమతి కందుల ఉషారాణి ఇటీవల స్వర్గసులైన విషయం విదితమే.. గురువారం రాజమహేంద్రవరం కందుల దుర్గేష్ నివాసం నందు కందుల ఉషారాణి పెద్ద కార్యం కార్యక్రమంలో రాజానగరం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ బత్తుల బలరామకృష్ణ పాల్గొని చిత్రపటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.