సత్తెనపల్లి జనసేన కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు

సత్తెనపల్లి నియోజకవర్గం: 75వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని సత్తెనపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలలో భాగంగా జాతీయ జెండాను ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి కొమ్మిశెట్టి వెంకట సాంబశివరావు ఆవిష్కరించారు. కార్యక్రమంలో జనసేన పార్టీ ఏడో వార్డ్ కౌన్సిలర్ రంగ్గిశెట్టి సుమన్, సత్తనపల్లి రూరల్ మండల అధ్యక్షులు నాదెండ్ల నాగేశ్వరరావు, వీరమహిళలు నామాల పుష్ప, గట్టు శ్రీదేవి, రామిశెట్టి శ్రీను, సత్తనపల్లి మండల మైనారిటీ సెల్ అధ్యక్షులు షేక్ ఖాసీం, రాష్ట్ర సీనియర్ కాపు నాయకులు కడియం అంకారావు, గోటికలపుడి లక్ష్మణ్, రామిసెట్టి కాశీ, జనసైనికులు పాల్గొన్నారు.