75వ గణతంత్ర దినోత్సవవేడుకల్లో పాల్గొన్న జనసేన నాయకులు

అవనిగడ్డ: జనసేన పార్టీ అవనిగడ్డ టౌన్ అధ్యక్షులు రాజనాల వీరబాబు మరియు టౌన్ కమిటీ ఆధ్వర్యంలో 75వ గణతంత్ర దినోత్సవవేడుకల్లో భాగంగా అవనిగడ్డ కోర్టు సెంటర్ నందు ఉన్న జనసేన పార్టీ పతాక దిమ్మ వద్ద జాతీయ జెండాకు వందన సమర్పణ జరిగినది. ఈ కార్యక్రమంలో ఉమ్మడి కృష్ణాజిల్లా జనసేన పార్టీ ఉపాధ్యక్షులు మత్తి వెంకటేశ్వర రావు, జనసేన పార్టీ జిల్లా అధికార ప్రతినిధి వేణుగోపాల్ రావు, సీనియర్ నాయకులు బచ్చు వెంకతనాధ్, చిలకలపూడి పాపారావు, చన్నగిరి సత్యనారాయణ, సుబ్బు జనసేన, తెలుగుదేశంపార్టీ నాయకులు యాసం చిట్టిబాబు, ఘంటసాల కన్నయ్య జనసేన పార్టీమండల కమిటీ నాయకులు గుగ్గిలం అనిల్, జనసేన పార్టీ అవనిగడ్డ టౌన్ ప్రధాన కార్యదర్శులు అన్నపరెడ్డి ఏసుబాబు, పోతన నాగరాజు, అవనిగడ్డ టౌన్ కమిటీ ఉపాధ్యక్షులు ఆళ్ళమళ్ళ చందుబాబు, చెల్లగరికల ఝాన్సీలక్ష్మీ, కె నరేష్, జనసేన పార్టీ కార్యకర్తలు అభిమానులు పాల్గొని జయప్రదం చేయడం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని స్మరించుకుంటూ ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.