దర్శి జనసేన కార్యాలయంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

దర్శి: 75వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం దర్శి నియోజకవర్గ జనసేన పార్టీ కురిచేడు మరియు అద్దంకి రోడ్డులలో గల కార్యలయంలో జాతీయ జండా ఎగురవేసి, స్వాతంత్ర్య సమరయోదులకు మరియు రాజ్యాంగ రచయితలకు ఘనంగా నివాళులు అర్పించారు జనసేన నాయకులు మరియు జనసైనికులు. వారి త్యాగాలను గుర్తు చేసుకొని వారి ఆశయాల సాధనకు కృషి చేస్తామని ప్రమాణం చేశారు. కురిచేడు రోడ్డులో గల పార్టీ కార్యాలయంలో దర్శి పట్టణ కమిటీ అధ్యక్షులు చాతిరాశి కొండయ్య పార్టీ జనసేన పార్టీ జిల్లా ప్రోగ్రాం కమిటీ సభ్యులు పసుపులేటి చిరంజీవి మరియు ముండ్లమూరు మండల కమిటీ అధ్యక్షులు తోట రామారావు పర్యవేక్షణలో నియోజకవర్గ ఇంచార్జి బొటుకు రమేష్ బాబుతో కలిసి జండా ఎగురవేశారు. తదనంతరం అద్దంకి రోడ్డులో గల గరికపాటి వెంకట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీనాయకులు గరికపాటి గోపి పర్యవేక్షణలో ఏర్పాటు చేసిన గణతంత్ర దినోత్సవ వేడుకలలో జనసేన పార్టీ దర్శి నియోజకవర్గ ఇంచార్జి బొటుకు రమేష్ బాబు మరియు జనసేన పార్టీ నాయకులు దిరిశాల ఏసురెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొని జండా ఎగుర వేసి జండా వందనం చేశారు. ఈ వేడుకలలో జిల్లా ప్రోగ్రాం కమిటీ సభ్యులు పుప్పాల రుద్రా, నియోజకవర్గ ఐ టీ కోఆర్డినేటర్ ఉల్లి బ్రహ్మయ్య, కురిచేడు మండల కమిటీ అధ్యక్షులు మాదా వెంకట శేషయ్య, దొనకొండ మండల కమిటీ అధ్యక్షులు గుండాల నాగేంద్ర ప్రసాద్, పట్టణ కమిటీ అధ్యక్షులు షఫీయుల్లాఖాన్, కురిచేడు మండల కమిటీ ఉపాధ్యక్షులు మంచాల నరసింహారావు, దర్శి మండల కమిటీ ప్రధాన కార్యదర్శి మారాబత్తుని వెంకటయ్య, జనసేన పార్టీ నాయకులు పుప్పాల పాపారావు, షేక్ మస్తాన్ బాషా, ఉప్పు ఆంజనేయులు, శ్రీ షేక్ వెంకటేష్, యాదాల వెంకటేష్, పులి కిశోర్, పందుల మోషే, మిండాల హనుమంతరావు, తోట రాయుడు, సీదా రామకృష్ణ, గరికపాటి గోపి, చెల్లు ఆంజనేయులు, తోట కోటేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు.