హరిరామ జోగయ్యని మర్యాదపూర్వకంగా కలిసిన యాళ్ల వర ప్రసాద్
ఆచంట: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ హోమ్ మినిస్టర్ కాపు సంక్షేమ సేన అధ్యక్షులు చేగొండి హరిరామ జోగయ్యని ప్రముఖ వ్యాపార వేత్త జనసేన సపోర్టర్ యాళ్ల వర ప్రసాద్ మర్యాద పూర్వకంగా కలిసారు. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లలో చేస్తున్న పలు సామాజిక కార్యక్రమాల కోసం చర్చించారు. ఆయనతో పాటు జనసేన ఉమ్మడి ప.గో జిల్లా నాయకులు బోనం చినబాబు, ఉన్నమట్ల ప్రేమ్ కుమార్, నాయకులు చుండూరి రంగయ్య నాయుడు, నల్లమోతు సత్య ప్రసాద్, యాళ్ల రవీంద్ర నాయుడు, యాళ్ల అబ్బు, వినుకొండ వెంకట రత్నం తదితరులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2024/01/WhatsApp-Image-2024-01-27-at-5.48.49-PM-1024x677.jpeg)