ఘనంగా శ్రీ కృష్ణ దేవ రాయల వారి జన్మదినోత్సవ వేడుకలు

మైలవరం: శ్రీ కృష్ణ దేవ రాయల వారి 533వ జయంతి సందర్భంగా శనివారం ఆ మహనీయుని స్మరించుకుంటూ ఈశ్వర్ రాయల్ ఆధ్వర్యంలో విజయవాడ నగరంలోని ప్రకాశం బ్యారేజ్ సమీపంలోని రాజీవ్ గాంధీ పార్క్ ఎదురుగా వున్న శ్రీకృష్ణదేవరాయల విగ్రహమునకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది.! ఈ కార్యక్రమంలో అక్కల రామ మోహన రావు (గాంధీ) ఇన్ ఛార్జ్ మైలవరం నియోజకవర్గం రాష్ట్ర అధికార ప్రతినిధి మరియు జనసేన నాయకులు, అభిమానులు, కాపు సోదరులు తదితరులు పాలుగోన్నారు.