కన్నాపై దాడిని ఖండించిన బొర్రా

సత్తెనపల్లి నియోజకవర్గం ముప్పాళ్ళ మండలం తొండపి గ్రామంలో తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి కన్నా లక్ష్మీనారాయణ బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం నిర్వహిస్తుండగా. వైసిపికి సంబంధించిన వ్యక్తులు రాళ్ల దాడి చేయడం తీవ్రంగా ఖండిస్తున్నానని. ప్రజల మన్ననలు పొందలేక ఓడిపోతామని తెలిసి ఈ రకంగా దాడులకు దిగటం ప్రజలను భయభ్రాంతులకు గురి చేయటం దిగజారుడుతనానికి నిదర్శనం. జనసేన-తెలుగుదేశం ప్రభుత్వాన్ని అధికారంలోకి రాకుండా ఆపడం మీ తరం కాదు. ఇప్పటికైనా మీ అరాచకాలు దౌర్జన్యాలు ఆపకపోతే భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించుకుంటారని సత్తెనపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త బొర్రా వెంకట అప్పారావు అన్నారు.