జనసేనలో చేరిన నేతలను సత్కరించిన జయరాం రెడ్డి
అనంతపురం నియోజకవర్గంలో నగరానికి చెందిన ప్రముఖ సీనియర్ రాజకీయ నాయకులు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలోకి చేరిన కాయగూర లక్ష్మీపతి, సీనియర్ లెక్చరర్ గుత్తి మధుసూదన్, వెన్నెల కృష్ణ, పేరూరు శ్రీనివాస్ లను అనంతపురం జిల్లా జనసేన ఉపాధ్యక్షులు లాయర్ కుంటిమద్ది జయరాం రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి వారిని సత్కరించడం జరిగింది. ఈ సందర్భంగా వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో అందరం సమిష్టిగా, కలిసికట్టుగా పనిచేసి జనసేన – టిడిపి ఉమ్మడి అభ్యర్థిని గెలిపించాలని చర్చించడం జరిగింది.
![](https://sritvtelugu.com/wp-content/uploads/2024/01/WhatsApp-Image-2024-01-29-at-17.24.06-1024x473.jpeg)
![](https://sritvtelugu.com/wp-content/uploads/2024/01/WhatsApp-Image-2024-01-29-at-17.23.37-1024x473.jpeg)