సుండుపల్లె మండలంలో జనంలో జనసేన

రాజంపేట, బుధవారం ఉమ్మడి కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం సుండుపల్లె మండలంలో జనంలో జనసేన కార్యక్రమం జి.రెడ్డి వారి పల్లె పంచాయతీ కోనంకివారి పల్లె, హరిజనవాడలలో జనసేన నాయకులు యల్లటూరు శ్రీనివాస రాజు మరియు జనసైనికులు ఇంటింటికి ప్రచారం చేసి పవన్ కళ్యాణ్ ఆశయాలను, జనసేన పార్టీ సిద్దాంతాలను ఎన్నికల గుర్తు “గాజు గ్లాస్”ను వివరించి కరపత్రాలను పంచడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రజలు ఎదురుకుంటున్న సమస్యలను సేకరించి రానున్న ఉమ్మడి ప్రభుత్వంలో జనసేన పార్టీ ద్వారా పరిష్కారం చూపుతామని జనసేన నాయకులు యల్లటూరు శ్రీనివాస రాజు భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సుండుపల్లె మండల నాయకులు చింతల రామకృష్ణ, ఒంటేరు రాజ, సలీం, మున్నా, మనోహర్ , శ్రీను రాజు, మదు, మదన్ కుమార్, సుంకర సుధారాణి, నారాయణ, వెంకయ్య, మదన్, మహమ్మద్, ఫరూఖ్, నవీన్, సులేమాన్, చెంగల రావు నాయక్, సురేష్, ప్రసాద్, నాగరాజ ,చంద్రశేఖర్,రమణ, రవి, రాము, వెంకట్, హరీష్, చంద్రశేఖర్, విజయ్, రెడ్డి శేఖర్, నాగార్జున, గురు ప్రసాద్, బాస్కర్, మౌలాళి, పరమ, రఘురామ రాజు, అబ్దుల్లా, కిషోర్, రవితేజ, సాయి, హరీష్, బాబు, రామయ్య, మరియు మాజీ సరపంచ్ సమ్మెట శివ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.