కాకినాడ జనసేన ఆధ్వర్యంలో మేము సిద్ధం కార్యక్రమం

కాకినాడ సిటి: జనసేన పార్టీ పి.ఏ.సి సభ్యులు మరియు కాకినాడ్ సిటి ఇంచార్జ్ ముత్తా శశిధర్ నాయకత్వంలో డైరీ ఫార్మ్ ప్రాంతంలో కొమ్మన సూర్య ప్రకాష్ మరియు బడిగంటి సురేష్ ఆధ్వర్యంలో మన నివాసానికి ఇంటి స్థలం కావాలి మన కాకినాడ లొనే అని అంటూ మేము సిద్ధం అనే కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముత్తా శశిధర్ మాట్లాడుతూ ఎన్నికలు దగ్గర పడ్డాకా జగన్మోహన్ రెడ్డి గారు భీంలీలో యుద్ధానికి మేము సిద్ధం అని అన్నారనీ దానికి ప్రతిగా కాకినాడలోని ప్రజలు ప్రతి ప్రాంతం వాళ్ళూ మేము సిద్ధం అని అంటున్నారన్నారు. ఆయన యుద్ధానికి ఎందుకు సిద్ధం అన్నారో తెలియదు కానీ, ఇక్కడ మాత్రం మాకు కాకినాడలోనే ఇళ్ళు కావాలి అని అంటూ, మేము కాకినాడలోనే పుట్టి పెరిగామనీ, మాకు ఇళ్ళు కావాలి అని అడిగితే ఎక్కడో కొమరగిరిలో ఇళ్ళని కేటాయించారనీ, 50 కోట్లతో విద్యుత్ సబ్ స్టేషన్ కడతారనీ, 500 కోట్లు టి.డి.ఆర్ బాండ్లు ఇస్తారనీ మరి మాకు ఇళ్ళు ఇవ్వడానికి డబ్బులు లేవన్నట్లు ఎక్కడో ఇవ్వడమేంటన్నారు. కాకినాడలోనే మాకు ఇళ్ళు కావాలి అని అంటూ నినాదాలు ఇచ్చారు. కాకినాడలోనే ఇళ్ళకోసం మేము యుద్ధం చెస్తామంటూ కాకినాడలోనే ఇళ్ళకోసం జగన్మోహన్ రెడ్డిని గద్దె దింపుతాం, కాకినాడలోనే ఇళ్ళకోసం ద్వారంపూడిని గద్దె దింపుతాం అని తెలియచెసారు. కాకినాడలోనే ఇళ్ళు కట్టుకునే విధంగా వీరందరికీ జనసేనపార్టీ హామీ ఇస్తోందని తెలియచేసారు. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో కాకినాడలోని ప్రతి పేదవాడికీ కాకినాడలోనే ఇల్లు ఇస్తామని తెలియచేసారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సమ్యుక్త కార్యదర్శి వాశిరెడ్డి శివ, సిటి ఉపాధ్యక్షుడు అడబాల సత్యన్నారాయణ, సత్య, నాగ కుమార స్వామి, నాని, కండవిల్లి దుర్గబాబు, రమాదెవి తదితరులు పాల్గొన్నారు.