అనంతగిరి జనసేన పార్టీ నాయకుల సమావేశం

  • ముఖ్యఅతిథిగా అరకు నియోజకవర్గ ఇన్చార్జి
  • చెట్టి చిరంజీవి

అరకు: అనంతగిరి మండలంలో శుక్రవారం కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో గ్రామస్థాయిలో జనసేన పార్టీ బలోపేతం చేయడం కోసం నాయకులు కీలకమైననిర్ణయం తీసుకోవడం జరిగింది. అనంతగిరి జనసేన నాయకులు కూర రమేష్. దూరు అఖిల్ కుమార్. బోయిన సుధాకర్. పోడెల బుజ్జిబాబు.జర్ర సుబ్బారావు. వీరమహిళ రత్న ప్రియ. జనసైనికులు పాల్గొన్నారు. త్వరలో జరగబోయే ఎన్నికల మహా సంగ్రామానికి జనసైనికులను సమయుక్తం చేసే కార్యక్రమంలో భాగంగా అరకు నియోజవర్గ జనసేన నాయకులు వివిధ గ్రామాల్లో విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు అనంతగిరి మండలంలో కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో ఇంచార్జి చెట్టి చిరంజీవి మాట్లాడుతూ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో జనసైనికులు అందరూ ఒక తాటిపై వచ్చే జనసేన తెలుగు దేశం అభ్యర్థి ఎవరైనాప్పటికీ కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. అనంతగిరి మండల అధ్యక్షుడు. చిట్టం మురళి మాట్లాడుతూ అరకు నియోజకవర్గం లో జనసేన పార్టీ పోటీ లో లేకపోయినా గత నాలుగు సంవత్సరాల నుంచి జనసేన పార్టీ నాయకులు నియోజకవర్గం లో అనేక పోరాటాలు చేశారని, అనేక ప్రజా సమస్యలపై తమ గళాన్ని విప్పారని ఈ సందర్భంగా తెలియజేశారు. నియోజకవర్గ స్థాయిలో ఉన్న అనేక సమస్యలను జనసేన పార్టీ మాత్రమే తీర్చగలుగుతుందని అందువల్ల పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ జనసేన-తెలుగు దేశం విజయానికి ప్రతి ఒక్కరు తోడ్పడాలని తెలియజేశారు.