గుంటూరు పశ్చిమలో జనంలోకి జనసేన ప్రారంభం
గుంటూరు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ విధానాలను వివరించి ప్రజలను చైతన్య వంతులను చేయడమే లక్ష్యంగా, జనంలో జనసేన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని గుంటూరు పశ్చిమ నియోజకవర్గం జనసేన పార్టీ పశ్చిమ సమన్వయకర్త బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శుక్రవారం 49వ డివిజన్ వేలాంగిని నగర్ అంబేడ్కర్ విగ్రహం వద్ద నుంచి కార్యక్రమం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గుంటూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు, టిడిపి రాష్ట్ర కార్యదర్శి మద్దిరాల మ్యాని, జనసేన పార్టీ టౌన్ ప్రెసిడెంట్ నేరెళ్ల సురేష్, 49 డివిజన్ అధ్యక్షులు అశోక్, ఇతర డివిజన్ అధ్యక్షులు కార్యకర్తలు మరియు వీర మహిళలు పాల్గొన్నారు.
![](https://sritvtelugu.com/wp-content/uploads/2024/02/WhatsApp-Image-2024-02-02-at-20.50.45-1024x683.jpeg)