గద్దె రామ మోహన్ రావు ఆధ్వర్యంలో కుట్టుమిషన్ల పంపిణీ

విజయవాడ ఈస్ట్: గురు నానక్ కాలనీ ఎన్ఏసీ కళ్యాణ మండపంలో తానా (తెలుగు అసోసియేషన్ అఫ్ నార్త్ అమెరికా) ఫౌండేషన్ ట్రస్టీ పుట్టగుంట సురేష్ సహకారంతో తెలుగుదేశం తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు గద్దె రామ మోహన్ రావు ఆధ్వర్యంలో 100 కుట్టుమిషన్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న తెలుగుదేశం పార్టీ విజయవాడ పార్లమెంటు ఇంచార్జ్ కేశినేని చిన్ని మరియు జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి & విజయవాడ తూర్పు నియోజకవర్గం సమన్వయకర్త అమ్మిశెట్టి వాసు. ఈ కార్యక్రమంలో తూర్పు నియోజకవర్గం జనసేన-తెలుగుదేశం పార్టీల డివిజన్ అధ్యక్షులు, నాయకులు, వీరమహిళలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.