నిజమైన ప్రజాస్వామ్యం ప్రజలు చూడబోతున్నారు: కిల్లో రాజన్

పాడేరు, వైసీపీతో యుద్దానికి మేము సిద్దం అని జనసేనపార్టీ రూరల్ జిల్లా జాయింట్ సెక్రెటరీ కిల్లో రాజన్ అన్నారు. మాయ మాటలు చెప్పి తండ్రి పేరు అడ్డం పెట్టుకొని అధికారాన్ని కైవసం చేసుకున్న జగన్ రాష్ట్ర ప్రజల బ్రతుకులతో, చెలగాటం మాడారు, నవరత్నాల పేరుతో ప్రజాధనాన్ని వృదాచేస్తు తాత్కాలిక అవసరాలు గోరంత ఇచ్చి ప్రజలను భ్రమలో ముంచి, రాష్ట్రాన్ని అప్పుల పాలుచేసి సర్వనాశనం చేశాడని దుయ్యబట్టారు. అర్థ సంక్షేమ పథకాలు అమలు చేస్తూ, అభివృద్ధి చేస్తునాననడం తమ ఆవివేకమని అన్నారు. సంక్షేమానికి, అబివృద్దికి తేడా తెలియకపోతే ఎలా. రాష్ట్ర ప్రజలకు, యువతకు ఏరకమైన బ్రతుకు తెరువు మార్గం చూపించారో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. ఉన్న జీవోలను ఊడబెరికి, తమకు అనుకూలంగా ఉన్న జీవోలను తెరపైకి తెచ్చి అందినంత దోచుకుంటున్నారు. ఇంతటి అరా హకాలు చేస్తూ రాష్ట్ర ప్రజల కడుపు కొడుతుంటే జనసేన పార్టీ చూస్తూ ఊరుకోదు. ప్రజల పక్షాన నిత్యం పోరాటం చేస్తూ ఉంటుంది. వైసీపీ అంథమే మా లక్ష్యం. రాష్ట్రంలో పేద ప్రజల బ్రతుకులకు బాసటగా నిలవడమే మా ధ్యేయం. యువతకు ఉద్యోగం, ఉపాధి, కల్పనలో భాగంగా సరికొత్త పరిశ్రమలు, వ్యవసాయ రంగాలలో పనిముట్లు, అందించి రైతులకు, ఆర్థిక, భరోసా కల్పించేందుకు పంటకు గిట్టు బాటు ధర కల్పనయే ధ్యేయంగా పవన్ కల్యాణ్ దృఢమైన సకల్పం కలిగి ఉన్నారని అన్నారు, జనసేన ఆశయం నెరవేరుతుంది. ప్రజలకు అండగా మేము ఉన్నాం. 2 నెలలలో వైసీపీ కనుమరుగుఅవుతుందని అన్నారు. నిజమైన ప్రజాసామ్యం ప్రజల్లోకి అమలవుతుంది. ప్రజా పరిపాలన రాబోతుందని తెలిపారు.