విశాఖ ఉమ్మడి జిల్లాలో జనసేన విజయం తథ్యం: డా.కందుల
విశాఖ, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని పార్టీ శ్రేణులు, నాయకులు కార్యకర్తలు, అభిమానులు కోరుకుంటున్నట్లు విశాఖ దక్షిణ నియోజకవర్గం జనసేన నాయకులు, 32వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు పేర్కొన్నారు. గురువారం నియోజకవర్గంలో ఆయన సుడిగాలి పర్యటన చేపట్టారు. ఈ సందర్భంగా నేరుగా ప్రజలను కలుసుకొని వారి సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం 32 వ వార్డు చెరువుగట్టు ప్రాంతానికి చెందిన పుష్పవతి జ్ఞానేశ్వరికి వెండి పట్టీలు, పట్టు బట్టలు అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ కందుల నాగరాజు మాట్లాడుతూ తెలియజేశారు ప్రస్తుతం పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నేతృత్వంలో రాష్ట్రంలో పట్టిష్టంగా ఉందని అన్నారు. నగరం ప్రాంతాలలో కూడా పార్టీ నాయకత్వం బలంగా ఉందన్నారు. పార్టీ నాయకత్వం ఆదేశాలతో నియోజకవర్గంలో పలు సేవా కార్యక్రమాలను నిర్విరామంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ప్రతిరోజు నియోజకవర్గంలో పలు ప్రాంతాలను పర్యటిస్తూ ప్రజల సమస్యలను తెలుసుకుంటూ వాటి పరిష్కారం కోసం కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. తనకు చేపడుతున్న కార్యక్రమాలకు అన్ని విధాలుగా సహకరిస్తున్న పార్టీ నాయకత్వానికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో జి.నారాయణరెడ్డి, శ్రీదేవి, జి.లక్ష్మి, హేమలత తదితరులు పాల్గొన్నారు.
![](https://sritvtelugu.com/wp-content/uploads/2024/02/WhatsApp-Image-2024-02-08-at-13.09.47-1024x768.jpeg)