నూతన సి.ఐని మర్యాదపూర్వకంగా కలిసిన పోలవరం జనసేన నాయకులు
పోలవరం, జీలుగుమిల్లి మండల సర్కిల్ ఇన్స్పెక్టర్ గా బాద్యతలు స్వీకరించిన టి.క్రాంతి కుమార్ ని గురువారం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి గడ్డమణుగు రవి కుమార్, పోలవరం నియోజకవర్గం ఇంచార్జి చిర్రి బాలరాజు, మండల అధ్యక్షులు పసుపులేటి రాము సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయం వద్ద మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలియజేసారు. మండలంలో ప్రస్తుత పరిస్థితుల గురించి వివరించారు.
![](https://sritvtelugu.com/wp-content/uploads/2024/02/WhatsApp-Image-2024-02-08-at-11.24.04-1024x576.jpeg)