హరిరామ జోగయ్యను మర్యాదపూర్వకంగా కలిసిన జనసేన నాయకులు

పాలకొల్లు, కాపు సంక్షేమ సేన వ్యవస్థాపకులు హరిరామ జోగయ్యని మర్యాదపూర్వకంగా కలిసిన జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఆమంచి స్వాములు మరియు వారి కుమారుడు రాజేంద్ర పాలకొల్లులోని కాపు సంక్షేమ సేన వ్యవస్థాపకులు హరిరామ జోగయ్యను కలిశారు. అలాగే పలు రాజకీయపరమైన విశేషాలు జనసేన పార్టీకి సంబంధించి సీట్ల కేటాయింపులు జనసేన తెలుగుదేశం పొత్తుపై సుదీర్ఘంగా చర్చించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఆమంచి స్వాములు జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు బాబి, ఆమంచి రాజేంద్ర మరియు కార్యకర్తలు జనసైనికులు పాల్గొన్నారు.