తిరుపతి పర్యటనకు జనసేనాని.. షాతో భేటీ..

తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికకు సంబంధించిన తేదీ ఖరారు కావడంతో అన్ని పార్టీలు ఉప ఎన్నికపై దృష్టిసారించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ తమ పార్టీ అభ్యర్థిని ప్రకటించింది. వైసీపీ, జనసేన-బీజేపీలు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉన్నది. ఇక ఇదిలా ఉంటె, ఈనెల 4,5 తేదీల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తిరుపతిలో పర్యటిస్తున్నారు. ఈనెల 4 వ తేదీ సాయంత్రం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో తిరుపతిలో భేటీ కాబోతున్నారు. తిరుపతి అభ్యర్థి, తాజా రాజకీయ పరిణామాలపై పవన్ కళ్యాణ్ అమిత్ షాతో చర్చించబోతున్నారు. అదే విధంగా మార్చి 5 వ తేదీన జనసేన, బీజేపీ నేతలతో పవన్ కళ్యాణ్ సమావేశం కాబోతున్నారు. ఆ సమావేశంలో తిరుపతి అభ్యర్థి ఎవరు అన్నది ఖరారయ్యే అవకాశం ఉంటుంది.