పలు కుటుంబాలను పరామర్శించిన చిలకం మధుసూదన రెడ్డి

ధర్మవరం నియోజకవర్గం: ధర్మవరం పట్టణం 40వ వార్డ్ గుట్టకింద పల్లికి చెందిన కానిస్టేబుల్ కురుబ గణేష్ 06-02-2024 వ తేదీన చిత్తూరు జిల్లా, పీలేరు నియోజకవర్గం, కె.వి పల్లి దగ్గర ఎర్రచందనం స్మగ్లర్ల దాడిలో వీరమరణం పొందడంతో జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన రెడ్డి అప్పుడు అందుబాటులో లేక శుక్రవారం గణేష్ ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులకు పరామర్శించి, మనోధైర్యం నింపి వారికి నేను, జనసేన పార్టీ అన్ని విధాల అండగా ఉంటుందని భరోసా ఇచ్చి 20 వేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది. అలాగే ధర్మవరం పట్టణం సాయి నగర్ కు చెందిన జనసేన పార్టీ క్రియాశీలక సభ్యుడు ఎన్న్ రమేష్ ఫిబ్రవరి 7వ తేదీన రాప్తాడు నియోజకవర్గం, కనగానపల్లి మండలం, తగరకుంట గ్రామంలో బంధువుల ఫంక్షన్ కు వెళ్లడంతో అదే గ్రామానికి చెందిన అబ్బాయి కెనాల్ లో కొట్టుకుని పోతుండగా ఆ అబ్బాయిని కాపాడాలని కెనాల్ లో దుంకి కాపాడే ప్రయత్నంలో ప్రమాదవశాత్తు మృతి చెందడంతో శుక్రవారం ప్రభుత్వ ఆసుపత్రిలో రమేష్ భౌతికకాయాన్ని సందర్శించి, నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించి, ధైర్యం చెప్పి 10 వేల రూపాయలను అంత్యక్రియల ఖర్చులకు అందజేసి, అలాగే అతి త్వరలో 5 లక్షల రూపాయల బీమా చెక్కును వచ్చే విధంగా కృషి చేస్తానని వారికి హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎక్స్ కౌన్సిలర్ వెంకటరెడ్డి, గుట్టకింద పళ్ళికి చెందిన వెంకటప్ప, మత్స్యకార వికాస విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బెస్త శ్రీనివాసులు, ధర్మవరం రూరల్ మండల కన్వీనర్ డి. నాగ సుధాకర్ రెడ్డి, మండల ఉపాధ్యక్షులు గొట్లురు జీవి, వొజ్జనప్ప, కార్యనిర్వాహణ కమిటీ సభ్యులు ప్యాదింది వెంకటేష్, కోటికి రామాంజి, కడపల సుధాకర్ రెడ్డి, టి. ప్రతాప్, కోల నాగార్జున, రమేష్, రాజేష్, చిలకం సుధాకర్ రెడ్డి, బాషా తదితరులు పాల్గొన్నారు.