శిరివెళ్ళ మండల జనసేన ఆత్మీయ సమావేశం

ఆళ్ళగడ్డ, శిరివెళ్ళ జనసేన పార్టీ కార్యాలయం అతి ముఖ్యమైన జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలతో జనసేన పార్టీ శిరివెళ్ళ మండల అద్యక్షులు ఇరిగెల ప్రతాప్ రెడ్డి భేటీ అవడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి పెట్టాలని పలు కీలకమైన సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలమూరు గౌస్, పెసరాయి చాంద్ బాషా, మాలి బాషా, నాగరాజు శెట్టి, పెద్ద బాలయ్య, హనుమంత రెడ్డి, ఇబ్రహీం ఖాన్, జబీవుల్లా, పెసరాయి ఇబ్రహీం, తేజ, గాజుల ఖుద్దూస్, విశ్వనాథ్, మాలి ఖాన్ తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.