వార్డ్ ప్రెసిడెంట్లను సన్మానించిన అళహరి సుధాకర్

  • కావలి మునిసిపాలిటీ పరిధిలో జనసేన సిద్ధాంతాల పాంప్లెట్ల రూపంలో ప్రజలలోకి తీసుకువెళుతున్న వార్డ్ ప్రెసిడెంట్లను సన్మానించిన అళహరి సుధాకర్

ఇంఛార్జి కావలి నియోజకవర్గం: జనసేన పార్టీ తరుపున కావలి 29, 16, 22, 18 మరియు 17 మునిసిపల్ వార్డ్ లలో గత కొంత కాలంగా ప్రతీ ఇంటికి జనసేన సిద్ధాంతాలతో ప్రజలలోకి వెళుతున్న వార్డ్ ప్రెసిడెంటులతో కలిసి ఆదివారం విట్స్ కాలేజ్ సెంటర్లో ఇంఛార్జి అళహరి సుధాకర్ నాయకులతో కలిసి జానీ, జిలానీ, షమ్మి, రాజా, రమణయ్య, జ్యోతి, ఇమ్రాన్, మాధవ, లకు శాలువాలు కప్పి సత్కరించారు. ఈ సందర్భంగా అళహరి సుధాకర్ మాట్లాడుతూ గత కొన్ని రోజులుగా వార్డ్ అధ్యక్షులు వారి వారి వార్డులో జానీ ఆధ్వర్యములో 16 నుండి 18, 22 & 29వ వార్డులో కలిసి ఒక గ్రూప్ గా ప్రతీ ఇంటికి జనసేన ఇంఛార్జి ఆదేశాలతో అని చెబుతూ పవన్ కళ్యణ్ గారి ఆశయాలను, సిద్ధాంతాలను ప్రజలు వివరిస్తూ ఈ వైసీపీ రాక్షస పాలనను తరిమికొట్టి జనసేన – టీడీపీ పార్టీలకు అధికారం వచ్చేలా ఓటువేసి గెలిపించ వలసినదిగా కోరుతూ వీరు చేసిన చేస్తున్న కృషికి మనస్సు పూర్తిగా వీరికి శాలువాలు కప్పినా అభినందనలు అని తెలిపారు. మరియు కావలి అధికార ప్రతినిధి రుషికేశ్, జానీ మాట్లాడుతూ ఈ ప్రభుత్వాన్ని కొంతకాలంగా పజలలోకి వెళుతుంటే ప్రజలు వైసీపీ ప్రభుత్వాఒ పైన వ్యతిరేఖత ఎక్కవగా ఉంది అని రాబోయే ఎలక్షన్లలో వైసీపీ అరాచక పాలన నుండి విముక్తి కలిగించి తప్పక ఓడించి జేఎస్పీ-టీడీపీ అభ్యర్థికి తప్పక గెలిస్తాము అని అన్నారు. ఇదే విధంగా ప్రతీ వార్డ్లో జనసేన పార్టీ ఇంటింటికీ తిరుగుతుంది అని తెలియజేశారు. ఈ కార్యక్రమములో కృష్ణయ్య, మల్లీ, ఎం శ్రీను, నవీన్, కొండయ్య, మందా శ్రీను, నరేష్, పవన్, దీపు తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.