శ్రీలక్ష్మీ అలివేలుమంగ సమేత శ్రీవేంకటేశ్వరస్వామి తిరునాళ్ళ మహోత్సవంలో పాల్గొన్న ఇమ్మడి కాశీనాధ్

ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం రాయవరం గ్రామం నందు శ్రీ లక్ష్మీ అలివేలుమంగ సమేత శ్రీ వేంకటేశ్వరస్వామి తిరునాళ్ళ మహోత్సవం సందర్భంగా జనసేన నాయకుల ఆహ్వానం మేరకు జనసేన పార్టీ మార్కాపురం నియోజకవర్గ ఇంఛార్జ్ ఇమ్మడి కాశీనాథ్ విచ్చేసి స్వామి వారి ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొని, అనంతరము జనసేన నాయకులు మరియు కార్యకర్తలతో రానున్న ఎన్నికల దృష్ట్యా చర్చించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మార్కాపురం పట్టణ జనసేన నాయకులు బొందిలి కాశీరామ్ సింగ్, జిల్లా కార్యదర్శి శిరిగిరి శ్రీను, జిల్లా సంయుక్త కార్యదర్శి ఎన్.వి.సురేష్, జిల్లా ప్రొగ్రామ్ కమిటి కో-ఆర్డినేటర్ వీరిశెట్టి శ్రీను, బెల్లంకొండ రామక్రిష్ణ, ఆది నారాయణ, ఆవుల వెంకట్, షఫీ, యాదగిరి శివ, గుండెబొమ్ము శ్రీను, రాయవరం జనసేన నాయకులు చందు, వెంకట నారాయణ, కార్తీక్ మరియు జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు.