వారాహి ప్రచార రథం ప్రారంభించిన కొణిదే దుర్గా ప్రసాద్

గుంటూరు: ఎన్నికలలో గెలుపే లక్ష్యంగా నేరెళ్ల సురేష్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వారాహి ప్రచార రథాన్ని మంగళవారం 12 డివిజన్ లోకి జనసైనికులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా 12వ డివిజన్ అధ్యక్షుడు కొణిదె దుర్గాప్రసాద్ మాట్లాడుతూ.. రాబోయే రోజుల్లో జనసేన టిడిపి గెలుపే లక్ష్యంగా నేరెళ్ల సురేష్ ఏర్పాటుచేసిన ప్రచార రథాన్ని డివిజన్లోకి స్వాగతం చెబుతూ జనసైనికులు ఉత్సాహంగా 12 డివిజన్లోని అన్ని విధులకు గడపగడపకు తిప్పుతూ ప్రచారాన్ని నిర్వహించారు. అన్ని వర్గాల ప్రజలు రాక్షస పాలన నుండి విముక్తి కోరుకుంటూ సంకీర్ణ ప్రభుత్వానికి మద్దతు తెలియజేస్తున్నారు. ఈ కార్యక్రమంలో 13వ డివిజన్ ప్రెసిడెంట్ పసుపులేటి నరేష్, 12 డివిజన్ జాయింట్ సెక్రెటరీ ఉదయ్ కుమార్, ప్రసాద్, రవికుమార్, నాగరాజు, చిన్ని జనసైనికులు పాల్గొన్నారు.