షాదికానలో ముస్లిం మైనారిటీ ఆత్మీయ సమావేశం
కర్నూలు జిల్లా, కోడుమూరు నియోజకవర్గం, గూడూరు పట్టణంలోని షాదికానలో ముస్లిం మైనారిటీ ఆత్మీయ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ శాసన మండలి ఛైర్మెన్ షరీఫ్ ముఖ్య అతిధిగా హాజరవడం జరిగింది. ఈ కార్యక్రమంలో కోడుమూరు జనసేన పార్టీ & తెలుగుదేశం పార్టీ సమన్వయ భాద్యుడు ఆకెపోగు రాంబాబు, టిడిపి పార్టీ ఇన్చార్జి ఆకెపోగు ప్రభాకర్, జనసేన పార్టీ-తెలుగుదేశం పార్టీ ముస్లిం సోదరులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.
![](https://sritvtelugu.com/wp-content/uploads/2024/02/WhatsApp-Image-2024-02-14-at-22.12.38-1024x684.jpeg)