శ్రీ కోదండ రామచంద్రస్వామి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న శ్రీమతి తంబళ్ళపల్లి రమాదేవి
నందిగామ, చందర్లపాడు మండల అధ్యక్షుడు ఆహ్వానం మేరకు, కాసరబాద గ్రామంలో శ్రీ కోదండ రామచంద్రస్వామి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో నందిగామ నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త శ్రీమతి తంబళ్ళపల్లి రమాదేవి పాల్గొనడం జరిగింది. చందర్లపాడు మండలంలోని కాసరబాద గ్రామంలో నూతనంగా నిర్మించిన రామాలయంలో శ్రీ సీతారామలక్ష్మణ సమేత ఆంజనేయ స్వామి వార్ల విగ్రహ ప్రతిష్ట మహోత్సవానికి, నందిగామ నియోజకవర్గ సమన్వయకర్త శ్రీమతి తంబళ్ళపల్లి రమాదేవి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా ఆలయ కమిటీ సభ్యులు శ్రీమతి తంబళ్ళపల్లి రమాదేవిని శాలువాతో సత్కరించి ఆలయ నిర్మాణానికి ఆర్ధిక సహకారం అందించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు పాల్గొన్నారు.
![](https://sritvtelugu.com/wp-content/uploads/2024/02/WhatsApp-Image-2024-02-15-at-17.23.29-683x1024.jpeg)
![](https://sritvtelugu.com/wp-content/uploads/2024/02/WhatsApp-Image-2024-02-15-at-17.23.29-1-1024x683.jpeg)