హరి కుటుంబానికి అండగా జనసేన

పీలేరు మండలంలో, చెరువు ముందర పల్లిలో సంక్రాంతి పండుగ సందర్బంగా జనసేన పీలేరు మండల నాయకులు కిడ్నీ డయాలసిస్ జరుగుతున్న హరి కుటుంబానికి జిల్లా కార్యదర్శి కలప రవి ఆధ్వర్యంలో ప్రతి నెల నిత్యావసర సరుకులు అందిస్తామని మాట ఇవ్వడం జరిగింది. ఇందులో భాగంగా 50కేజీల బియ్యం మరియు నెలకి సరిపడా నిత్యవసర వస్తువులు అందించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి కలప రవి మాట్లాడుతూ ఇందులో భాగంగా ప్రమాదవశాత్తు తన ఎడమ చేతిని కోల్పోయిన కుమార్ కి అండగా ఉంటామని, ప్రభుత్వం నుండి పింఛన్ వచ్చేలా కృషి చేస్తామని తెలియచేయడం జరిగింది. అలానే గ్రామంలో అన్యాక్రాంతం అయిన ఎస్సీ అసైన్డ్ భూములని జనసేన – తెలుగుదేశం ఉమ్మడి ప్రభుత్వం రాగానే హక్కు దారులకు పట్టాలు అందించేలా కృషి చేస్తామని తెలియచేయండం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి కలప రవి, మండల అధ్యక్షులు వల్లెపు మోహన్ కృష్ణ, ఉప అధ్యక్షులు గురు మోహన్, ప్రధాన కార్యదర్శి గజేంద్ర, కార్యదర్శి నవీన్, జనసేన నాయకులు హరీష్, కాపు యువసేన అధ్యక్షులు అండే సురేష్ మరియు జనసైనికులు పాల్గొన్నారు.