సుంకర శ్రీనివాస్ ని మర్యాదపూర్వకంగా కలిసిన యల్లటూరు శ్రీనివాసరాజు
ఉమ్మడి కడప జిల్లా, కడప పట్టణం జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీ కడప జిల్లా సమన్వయ కమిటీ సుంకర శ్రీనివాస్ ని రాజంపేట జనసేన నేత యల్లటూరు శ్రీనివాస రాజు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించారు. యల్లటూరు శ్రీనివాస రాజుని సాదరంగా స్వాగతించి శాలువతో సత్కరించిన సుంకర శ్రీనివాస్. అనంతరం ఇరువురు భవిష్యత్తు కార్యాచరణ మీద ఇరువురు చర్చించుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసి యల్లటూరు శివరామరాజు, కడిమెళ్ల శ్రీనివాసరాజు, మాజీ సర్పంచ్ సమ్మెట శివప్రసాద్, చింతల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
![](https://sritvtelugu.com/wp-content/uploads/2024/02/WhatsApp-Image-2024-02-16-at-16.32.46-1024x537.jpeg)