అగ్ని ప్రమాదబాధితులకు మనోధైర్యాన్నిచ్చిన చిర్రి బాలరాజు

పోలవరం, బుట్టాయిగూడెం మండలం, పాత అలివేరు గ్రామంలో శుక్రవారం జరిగిన అగ్నిప్రమాదంలో కుంజా కన్నయ్య తాటాకు ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. ఇందుకుగాను శనివారం పోలవరం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జి చిర్రి బాలరాజు సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. వారికి నిత్యావసర సరుకులు, బట్టలు, దుప్పట్లు, బియ్యం కూరగాయలు, 5,000 రూపాయల నగదు అందజేసి జనసేన పార్టీ ఎల్లప్పుడూ మీకు అండగా ఉంటుందని హామీ ఇవ్వడం జరిగింది. సచివాలయ సిబ్బందికి ఫోన్ చేసి వారికి నష్టపరిహారం అందజేత గురించి అడగ్గా ప్రభుత్వం ఎలాంటి పరిహారం అందదని చెప్పడంతో పేదలకు అందుబాటులో ఉండని ప్రభుత్వం మనకు అవసరం లేదని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో గుండుమోగుల సత్యనారాయణ, తీగల గోపి, సింగంశెట్టి మనోహర్, ఏలేటి ఏడుకొండలు, కుప్పల నాగరాజు, మధు, ఏసుబాబు, అన్వార్ కొవ్వాసు వెంకటేష్, సోదెం మహేష్, షకీల్, బాషా తదితరులు పాల్గొన్నారు.