యల్లటూరు శ్రీనివాస రాజుని కలిసిన జనసేన పార్టీ ఐటీ కో-ఆర్డినేటర్స్

ఉమ్మడి కడప జిల్లా, రాజంపేట పట్టణం, జనసేన పార్టీ కార్యాలయం (యల్లటూరు భవన్) నందు ఆదివారం జనసేన పార్టీ నేత యల్లటూరు శ్రీనివాస రాజుని జనసేన పార్టీ ఉమ్మడి కడప జిల్లా ఐటీ కో-ఆర్డినేటర్లు కలవడం జరిగింది. రాజంపేట జనసేన పార్టీకి టెక్నికల్ గా తమ పూర్తి మద్దతు ఉంటుందని, ప్రతి మండల కేంద్రంలో ఉన్న ఐటీ కోఆ-ర్డినేటర్లని కలుపుకుని పార్టీకి ఎలక్షనీరింగ్ ప్రాసెస్ లో పూర్తిగా సహకరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి కడప జిల్లా ఐటి కో-ఆర్డినేటర్ యాపరాల వెంకటేష్, మైదుకూరు కో-ఆర్డినేటర్ భూమిరెడ్డి సిద్దాంత్, రాయచోటి కోఆర్డినేటర్ నీలకంఠం సుధీర్, జమ్మలమడుగు కో-ఆర్డినేటర్ దిలీప్ రాజ, మాజీ జెడ్పిటీసీ యల్లటూరు శివరామరాజు, రాజంపేట ఐటీ సభ్యులు ప్రశాంత్ భారతాల, రాజంపేట నాయకులు కోలాటం హరికృష్ణ, ముత్యాల చలపతి పాల్గొన్నారు.