రాదేయపాలెం గ్రామంలో వైఎస్ఆర్సిపికి బిగ్ షాక్

  • రాదేయపాలెం గ్రామం నుండి పెద్ద ఎత్తున జనసేన తీర్థం పుచ్చుకున్న శెట్టిబలిజ, యాదవ, మాల, మాదిగ సోదరులు.
  • బత్తుల బలరామకృష్ణ ఆధ్వర్యంలో నిత్యం వైసిపి నుండి ఉదృతంగా జనసేన పార్టీలోకి కొనసాగుతున్న చేరికలు.
  • రాజానగరం మండలంలో తుడిచిపెట్టుకుపోతున్న వైసిపి

రాజానగరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ బత్తుల బలరామకృష్ణ పార్టీలో జాయిన్ అయిన దగ్గర్నుండి నిత్యం నియోజకవర్గంలో వైసిపికీ చెందిన కీలక నేతలను, కార్యకర్తలను జనసేన పార్టీలోకి పెద్ద ఎత్తున జాయినింగ్స్ చేస్తూనే ఉన్నారు. రాష్ట్రం మొత్తం రాజానగరం నియోజకవర్గం గురించే చర్చించుకునేలా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్వయంగా రాజానగరం సీటు జనసేన పార్టీకి కేటాయించిన ఈ శుభ సందర్భంగా శరవేగంగా పార్టీని అత్యంత భారీ మెజారిటీతో గెలుపే లక్ష్యంగా దూసుకెళ్తున్న ఈ కీలక సమయంలో రాజానగరం నియోజకవర్గం, రాజానగరం మండలం, రాదేయపాలేం గ్రామంలో అవినీతి, అరాచక పాలన చేస్తూ, నియోజకవర్గంలో పెద్ద ఎత్తున సహజ వనరులను దోచుకు తింటూ, 2019 వైసిపి పార్టీ గెలుపు కోసం కష్టపడిన సీనియర్ నేతల, కార్యకర్తల సేవలను విశ్వరించి, అడ్డగోలుగా వ్యవహరిస్తూ అసమర్ధ పాలన చేస్తున్న స్థానిక ఎమ్మెల్యే జక్కంపూడి రాజా వ్యవహార శైలికి విసుకు చెంది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలు, సిద్ధాంతాలు ఆయన రాజకీయ ప్రయాణం, భావితరాల భవిష్యత్తు కోసం ఆయన పడుతున్న తపన. అదే సమయంలో రాజానగరం నియోజకవర్గంలో బత్తుల బలరామకృష్ణ, శ్రీమతి వెంకటలక్ష్మి దంపతులు అనునిత్యం చేస్తున్న పార్టీ అభివృద్ధి కార్యక్రమాలతో పాటు నియోజకవర్గంలో ఎవరికి ఏ కష్టం వచ్చినా ఆదుకుంటున్న తీరు, చేస్తున్న దానధర్మాలు, ప్రజలకు కష్టాలు వచ్చినప్పుడు ఆయన నిలబడుతున్న తీరు, ప్రజా సమస్యలపై పోరాడుతున్న ఆయన సమర్థమైన నాయకత్వానికి ఆకర్షితులై బత్తుల బలరామకృష్ణ ఆధ్వర్యంలో రాదేయపాలెం గ్రామం వైసీపీకి చెందిన ముఖ్య నాయకులు, కార్యకర్తలు 200 మంది జనసేన పార్టీలో జాయిన్ అయ్యారు. వీరందరికీ బత్తుల బలరామకృష్ణ జనసేన పార్టీ కండువాలు వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా బత్తుల బలరామకృష్ణ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఆశయం, చంద్రబాబు అనుభవంతో జనసేన-టిడిపి ఉమ్మడి ప్రభుత్వ స్థాపనకు అందరూ సమిష్టిగా కృషి చేసి, నీతి నిజాయితీపరుడైన పవన్ కళ్యాణ్, సుదీర్ఘ అనుభవం ఉన్న చంద్రబాబుల నాయకత్వంలో రాష్ట్రాన్ని రక్షించి, ఈ అరాచక ప్రభుత్వంపై అందరూ సమిష్టిగా తిరుగుబాటు చేసి జగన్ రెడ్డి ప్రభుత్వాన్ని గద్దె దింపి, పారదర్శకంగా అవినీతిరహిత ప్రజాపాలన తీసుకురావడానికి అందరూ సమైక్యంగా శ్రమించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, జనసైనికులు, వీరమహిళలు, రాదేయపాలేం గ్రామ పెద్దలు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.