ఆంధ్రజ్యోతి ఫోటో గ్రాఫర్ కృష్ణపై దాడి హేయమైన చర్య: చిర్రి బాలరాజు

పోలవరం, అనంతపురం జిల్లా రాప్తాడులో శనివారం వైసీపీ నిర్వహించిన సిద్ధం బహిరంగ సభలో ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ బి కృష్ణ పై వైకాపా గుండాలు మూకుమ్మడి గా దాడి చేసి హేయమైన చర్య అని పోలవరం జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ చిర్రీ బాలరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి నేటి వరకు అన్ని వర్గాలు దళితులు జర్నలిస్టులు పై దాడులు చేస్తూ పైశాచిక ఆనందాన్ని పొందుతుందని వైసీపీకి రోజులు దగ్గర పడ్డాయని ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు రాబోయేది జనసేన టిడిపి ఉమ్మడి కార్యాచరణతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ప్రతి ఒక్కరికి బుద్ధి చెబుతామని సందర్భంగా హెచ్చరించారు. జర్నలిస్ట్ బి కృష్ణ పై దాడి చేసిన వైసిపి కొండలను చట్టబద్ధంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.