సమరభేరి ర్యాలీని ప్రారంభించిన గంగారపు రామదాస్ చౌదరి
మదనపల్లె జిల్లా సాధన కోసం సమరభేరి ర్యాలీని అఖిలపక్ష నాయకుల ఆధ్వర్యంలో మదనపల్లె పట్టణంలో ఎస్టేట్ నుండి ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాయలసీమ కో-కన్వీనర్ గంగారపు రామదాస్ చౌదరి జెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు. ఈ సందర్భంగా గంగారపు రామదాస్ చౌదరి మాట్లాడుతూ ఈ వైసీపీ ప్రభుత్వం మదనపల్లి తంబాలపల్లి, పుంగనూరు, పీలేరు ప్రజలు ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసి మదనపల్లిని జిల్లాగా ప్రకటించకుండా రాయచోటిని జిల్లాగా చేసిందని మదనపల్లికి తీరని అన్యాయం చేసారని వచ్చే ఎన్నికల్లో జనసేన-టీడీపీ పార్టీ ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మదనపల్లెను జిల్లాగా ప్రకటించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి జంగాల శివరాం, జిల్లా జాయింట్ సెక్రటరీ సనా ఉల్లా, రూరల్ అధ్యక్షులు గ్రానైట్ బాబు, ఉపాధ్యక్షులు చంద్రశేఖర, పట్టణ ప్రధాన కార్యదర్శి గండికోట లోకేష్, రూరల్ ప్రధాన కార్యదర్శి జంగాల గౌతమ్, లవన్న, తాళ్ల గిరి, మేకలచెర్వు అర్జున, యువ నాయకులు షేక్ ఫాజీల్, నాగరాజు, రూరల్ ప్రధాన కార్యదర్శి పవన్ శంకర, రూరల్ సెక్రటరీ జనార్దన్, నరేష్, జెస్వంత్ తదితరులు పాల్గొన్నారు.
![](https://sritvtelugu.com/wp-content/uploads/2024/02/WhatsApp-Image-2024-02-20-at-16.34.24-1024x580.jpeg)
![](https://sritvtelugu.com/wp-content/uploads/2024/02/WhatsApp-Image-2024-02-20-at-16.34.25-580x1024.jpeg)