బెంతు ఒరియాల నిరాహార దీక్ష 55వ రోజు

ఇచ్చాపురం: కవిటి మండలంలో జరుగుతున్న రిలే నిరాహార దీక్ష 55వ రోజుకి చేరుకున్నది. మంగళవారం రిలే నిరాహార దీక్షలో బెంతో ఒరియా కమ్యూనిటీ నుండి సూది పుట్టుక గ్రామ యువత, పెద్దలు, మహిళలు పాల్గొన్నారు. తమ కులానికి కులధ్రువీకరణ పునరుద్దరణ గుర్తింపు పత్రాలు ఇచ్చి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
దీక్షలో పాల్గొన్న వారు కేశవ దలై, కృష్ణ బిసై, బొనమలి దలై, కోమొలోచన్ దలై, దొంబురు దొలై, జయసేన్ బిసై, ప్రేమ్ సాయి దొలై, సర్జో దొలై, సొంకొర్ దొలై, మొల్లి, దిలై, తులుస దొలై, అనిల్ సహు, బినాయికో దొలై, కొనొక దొలై, ఫుల్లో బిసై, హర దొలై, బురింది దొలై, వేదవర్ బిసై, ఘనశ్యామ్ పాల్గొన్నారు. గౌరవనీయ పుర్ణో సంఘీభావం తెలిపారు.