జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఉచిత మంచినీటి సౌకర్యం

ప్రకాశం జిల్లా, యర్రగొండపాలెం నియోజకవర్గం: పుల్లలచెరువు మండలంలో ఫిబ్రవరి ఒకటో తారీకు నుండి ప్రభుత్వం వారు మంచినీటి ట్యాంకర్లు నిలుపుదల చేసిన విషయం అందరికీ తెలిసినదే. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు యర్రగొండపాలెం ఇన్చార్జి డా. గౌతంరాజు సారధ్యంలో జనసేన మండల మాజీ మండల కన్వీనర్ పసుపులేటి వెంకటేశ్వరరావు (స్టూడియో బుజ్జి), తోట కాశీరామ్, దాసి వెంకటేశ్వరరావు(ఆర్మీ బుజ్జి) పలువురు జనసేన నాయకులు కార్యకర్తల కలయికలతో పుల్లల చెరువులోని ప్రజలకు ట్యాంకర్ల ద్వారా ఉచిత మంచినీటిని సరఫరా చేస్తున్నారు. అధికారంలో ఉన్న వైఎస్ఆర్ పార్టీ నిమ్మకు నీరెత్తినట్లు ప్రవర్తిస్తూ ప్రజలకు మంచినీటి సరఫరా చేయాల్సింది పోయి ట్యాంకర్లను నిలిపివేయాలని ఆదేశించిన ప్రభుత్వ తీరును ప్రజలు తప్పుపడుతున్నారు. ఇప్పటిదాకా అధికారంలో లేని జనసేన పార్టీ ట్యాంకర్ల ద్వారా మంచినీటిని సరఫరా చేయటాన్ని ప్రజలు హర్షిస్తున్నారు. ప్రజలకు ఏ సమస్య వచ్చినా జనసేన నాయకులు, జనసైనికులు నిరంతరం ఎలాంటి పోరాటం చేయటానికి అయిన ముందు ఉంటారని మరోసారి రుజువైందని ప్రజలు కొనియాడుతున్నారు. రాబోవు రోజుల్లో జనసేన పార్టీకి అధికారం కట్టబెడితే ప్రజలకు మరింత మేలు కలుగుతుందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.