సమరభేరికి ముద్దతుగా 100 బైకుల ర్యాలీగా మదనపల్లి జనసేన

మదనపల్లి జిల్లా సాధనకై బహుజన సేన రాష్ట్ర అధ్యక్షులు చందు ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన సమరభేరికి ముద్దతుగా 100 బైకుల ర్యాలీగా మదనపల్లి జనసేన నాయకులు శ్రీరామ రామాంజనేయులు ఆధ్వర్యంలో వెళ్ళి సమరభేరిలో పాల్గొన్న మదనపల్లి జనసేన యువ నాయకులు హరిహరన్ మదనపల్లి పట్టణ అధ్యక్షులు నాని జగదీష్ బాబు జనసేన నాయకులు సుప్రీం హర్ష, సోను, గణేష్, గంగాధర్, ధరణి, నవాజ్, అశ్వత్ కుప్పల శంకర యాసీన్ మరియు పెద్ద సంఖ్యలో జనసైనికులు పాల్గొన్నారు. జనసేన టిడిపి ఉమ్మడి ప్రభుత్వం ఏర్పాటు అవ్వగానే కచ్చితంగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మదనపల్లి జిల్లాగా ప్రకటించడం ఖాయమని ఈ సందర్భంగా శ్రీరామ రామాంజనేయులు మీడియాకు తెలియజేశారు.