రాగంపేట రెల్లివీధి ప్రాంతంలో రెల్లిపోరుబాట

కాకినాడ సిటిలో జనసేన పార్టీ పి.ఏ.సి సభ్యులు మరియు కాకినాడ సిటి ఇంచార్జ్ ముత్తా శశిధర్ నాయకత్వంలో బంగారు శ్రీనివాస్ ఆధ్వర్యంలో స్థానిక 31 డివిజన్ రాగంపేట రెల్లివీధి ప్రాంతంలో రెల్లిపోరుబాట ప్రకటిస్తూ యుద్ధానికి మేము సిద్ధం అనే కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ముత్తా శశిధర్ మాట్లాడుతూ సమాజంకోసం తమ జీవితాలని పణంగా పెట్టి జీవనం సాగించే రెల్లిసోదరుల జీవితాలను ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్లక్ష్యం చేస్తున్నాడనీ, సిద్ధం సిద్ధం అని యుద్దనికి కాలుదువ్వుతున్న ఈ ముఖ్యమంత్రి రెల్లిసోదరుల కోసం తనతండ్రి శంఖుస్థాపనచేసిన నిర్మాణాలను పూర్తిచేయడానికి ఎందుకు సిద్ధం కాదో సమాధానం చెప్పాలని డిమాండ్ చేసారు. రెల్లిసోదరసోదరీమణుల ఆరోగ్యాల పరిరక్షించేందుకు చర్యలు, వీరికి ఉద్యోగాలు మునిసిపాలిటీలో కల్పించేందుకు చర్యలు చేపట్టని ఈ వై.సి.పి ప్రభుత్వాన్ని గద్దెదించేందుకు తామంతా సిద్ధం అని చెపుతున్నారన్నారు. ఈ వై.సి.పి ప్రభుత్వాన్ని ఇంటికి పంపేందుకు మేము సిద్ధం అని అంటున్నారనీ, త్వరలో జనసేన తెలుగుదేశం పార్టీల ఉమ్మడి ప్రభుత్వంలో మెరుగైన పాలన పొందవచ్చని ఆశాభావాన్ని వెలిబుచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి తలాటం సత్య, సింగం పల్లి రాజు, బంగారు కళ్యాణ్, ఆకుల సత్య, బందన్ అజయ్, ప్రసాంత్, నిమ్మకాయల శ్యాం, మెగాఫామిలీ అసోసియేషన్ ప్రెశిడెంట్ చింతకాయల చిన్ని, రవి, కోడి శ్రీను, నాని తదితరులు పాల్గొన్నారు.