పలు కుటుంబాలను పరామర్శించిన పితాని

ముమ్మిడివరం, ఐ.పోలవరం మండలం, టి.కొత్తపల్లి గ్రామానికి చెందిన ఇటీవల మృతిచెందిన రెడ్డి సుబ్బలక్ష్మి పెద్ద కార్యంలో పాల్గొని వారి చిత్రపటానికి నివాళులు అర్పించి, వారి కుటుంబ సభ్యులను, అలాగే ముమ్మిడివరం మండలం చింతావాని రేవు గ్రామానికి చెందిన రచ్చా ధనలక్ష్మి ఇటీవల మృతిచెందడం జరిగింది వారి కుమారులు సత్యనారాయణ ధర్మారావు లక్ష్మణరావుని రాష్ట్ర జనసేన పార్టీ పీఏసీ సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గ ఇంచార్జ్ పితాని బాలకృష్ణ పరామర్శించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జక్కంశెట్టి బాలకృష్ణ (పండు), నరాలశెట్టి రాంబాబు, సవరపు వెంకట్, అక్కల శ్రీను, పెన్నాడ శివ, గుత్తుల శంకర్, విత్తనాల రవి, ఉద్దీశ వీరబాబు, పెద్దిరెడ్డి శ్రీహరి, ఉద్దీశ సురేష్, కొప్పాడి చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.