నిర్మాణంలో అగిపోయిన ఇంటికి ఆర్థిక చేయూతనిచ్చిన బొర్రా

సత్తెనపల్లి, నకరికల్లు మండలం చాగల్లు గ్రామంలో ఆర్థిక స్థోమత లేక, ఉన్న డబ్బు చాలక నిర్మాణంలో ఆగిపోయిన, ఇంటి నిర్మాణానికి జనసేన నియోజకవర్గ సమన్వయకర్త బొర్రా వెంకట అప్పారావు ఆర్థిక సహాయం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజంలో అన్ని తరగతుల ప్రజలకు తన వంతు సహాయం చేయడంలో ఎప్పుడూ ముందుటానన్నారు. సమాజసేవే లక్ష్యంగా రాజకీయాల్లోకి వచ్చానని ప్రజల్లో ఒకడిగా, వారి సమస్యల్లో సంతోషాలలో తోడుగా నిలవాలని ప్రజలందరూ బాగుండాలని అందులో తాను ఉండాలని కోరుకున్నట్లు చెప్పారు. పదవుల కోసం, అధికారం కోసం, డబ్బు కోసం రాజకీయాల్లోకి రాలేదని కేవలం ప్రజాసేవ లక్ష్యంగా రాజకీయాల్లోకి వచ్చానన్నారు. తన దృష్టికి వచ్చిన ఎటువంటి సమస్య ఉన్నవారికైనా ఎంతోకొంత తన వంతు బాధ్యతగా సహాయ సహకారాలు ఉంచడానికి ఎప్పుడూ వెనకడనన్నారు. సమ సమాజ స్థాపనలో బడుగు బలహీన వర్గాల కోసం ప్రశ్నించే వ్యక్తిగా పవన్ కళ్యాణ్ ఉన్నారని ఆయన ఆశయాలు లక్ష్యాలు ఆకాంక్షలు నచ్చి జనసేనలోకి వచ్చానన్నారు పార్టీ ఏదైనాప్పటికీ ప్రజాసేవ అంతిమ లక్ష్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో నకరికల్లు మండల అధ్యక్షురాలు తాడువాయి లక్ష్మీ శ్రీనివాస్, సత్తెనపల్లి మండల అధ్యక్షులు నాదెండ్ల నాగేశ్వరరావు, కొదమూల నాగేశ్వరరావు, కొదమూల శ్రీను, తాళ్లపోగు రామయ్య, ముప్పాళ్ళ మోహన్ రావు, జొన్నలగడ్డ ముత్తయ్య, ముప్పాళ్ళ మహేష్, ముప్పాళ్ళ ముత్తారావు తాళ్ల పోగు రాంబాబు తాళ్ల పోగు రమణయ్య కొదమల బ్రహ్మాం, పాస్టర్, గ్రామస్తులు, జనసైనికులు పాల్గొన్నారు.