రాష్ట్ర అభివృద్ధి జనసేన జెండా అజెండా, అందుకే ఇంటింటికిపవనన్న ప్రజా బాట: బొర్రా

సత్తెనపల్లి: రాష్ట్రం అభివృద్ధి చెందటమే జనసేన జెండా అజెండా అని దానికోసమే మిత్రపక్షాలతో ముందుకు నడుస్తుందని, రాష్ట్ర అభివృద్ధి భవిష్యత్తు భవిష్యత్తు జనసేన జెండా అజెండా అని సత్తెనపల్లి నియోజకవర్గ సమన్వయకర్త బొర్రా వెంకట అప్పారావు అన్నారు. గురువారం సాయంత్రం బృగుబండలో జరిగిన జనసేన ఇంటింటికి పవన్ ప్రజా బాట కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. గ్రామంలోని స్వర్గీయులు వంగవీటి మోహన్రంగా, ఎన్టీ రామారావు కు పూలదండలతో ఘన నివాళులు అర్పించారు. అనంతరం ఇంటింటికి వెళ్లి ప్రజల యొక్క యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ప్రజల సమస్యలు పాలకుల వైఫల్యాలు తెలుసుకోవటమే కాకుండా పవన్ కళ్యాణ్ భవిష్యత్ ప్రణాళిక కార్యాచరణ హామీలు గ్రామస్తులందరికీ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు భారీగా పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. ప్రజల సహకారం ప్రోత్సాహం చూస్తుంటే మరింత ఉత్సాహంగా పనిచేయాలని ఉందని సత్తనపల్లి జనసేన ని బొర్రా వెంకట అప్పారావు అన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి కొమ్మిశెట్టి వెంకట సాంబశివరావు, సత్తెనపల్లి 7 వార్డు కౌన్సిలర్ రంగిశెట్టి సుమన్, ప్రోగ్రామింగ్ కమిటీ సభ్యులు బత్తుల కేశవ, నాగభూషణం, సత్తెనపల్లి మండల అధ్యక్షులు నాదెండ్ల నాగేశ్వరరావు, నకరికల్లు మండల అధ్యక్షురాలు తాడువాయి లక్ష్మి శ్రీనివాస్, మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు చిలకాపూర్ణ, మండల మైనారిటీ సెల్ ఉపాధ్యక్షులు షేక్ రఫీ, ఇంకొల్లు శివ, గ్రామ అధ్యక్షులు బి నాగరాజు, తులవ సీతయ్య, తులవ నరేంద్ర, ఏసుబాబు, ధూళిపాల గ్రామ అధ్యక్షులు కే నరసయ్య, బిట్రగుంట కృష్ణ, నామాల పుష్ప, గట్టు శ్రీదేవి, దార్ల శ్రీను, కడియం అంకరావు, అద్దేపల్లి రామారావు, రామిశెట్టి శ్రీను, మండల కార్యదర్శి షేక్ ఉమర్, కొటికలపూడి లక్ష్మణ్, జిర్రా గణేష్, రామిశెట్టి సందీప్, జిల్లా నాయకులు, మండల నాయకులు, గ్రామ నాయకులు, వీరమహిళలు, జనసైనికులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.