వరికూటి నాగరాజుని కలసిన యూటిఎఫ్ నాయకులు

  • ఉద్యోగ పెన్షన్ విధానం గురించి జనసేన – టీడీపీ ఉమ్మడి మానిఫెస్టో లో చేర్చాలి

కనిగిరి: జనసేన పార్టీ కనిగిరి నియోజకవర్గ సమన్వయ కర్త వరికూటి నాగరాజుని పొదిలి, మర్రిపూడి మరియు కొనకనమిట్ల మండల ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (యూ టి ఎఫ్) ఉపాధ్యాయ నాయకులు కలిశారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగ పెన్షన్ విధానం గురించి జనసేన – టీడీపీ ఉమ్మడి మానిఫెస్టో లో చేర్చాలని కోరారు. ఈ సందర్భంగా వరికూటీ నాగరాజు మాట్లాడుతూ మీ యొక్క విషయాన్ని మా అధినేత పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తేసుకొనివెళ్తను అని పేర్కొన్నారు. అదే విధంగా రాబోవు ఎన్నికల్లో మా కూటమికి మద్దతు తెలిపి గెలిపించవలసినదిగా కోరారు. ఈ కార్యకమంలో ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ నాయకులు ప్రకాశం జిల్లా సహాధ్యక్షులు షేక్ అబ్దుల్ హై, ప్రకాశం జిల్లా కార్యదర్శి పి.బాలవెంకటేశ్వర్లు, పొదిలి మండలం ప్రధాన కార్యదర్శి పి.వెంకటేశ్వర్లు, చవలం వెంకటేశ్వర్లు, కాట్రగడ్డ సుబ్బారావు, తాళ్లూరి నరసింహారావు, దేవిరెడ్డి నారాయణ రెడ్డి, సి. హెచ్. రాజేంద్ర బాబు, డీ. సుబ్బారావు మరియు ఉపాధ్యులు పాల్గొని వినతిపత్రం ఇచ్చారు.