బొంతు రాజేశ్వరరావుకి రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ వినతి

రాజోలు, జనసేన నాయకులు బొంతు రాజేశ్వరరావుని రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ సభ్యులు మలికిపురం మండల కేంద్రం మలికిపురంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పాత పెన్షన్ విధానం అమలు చేసే విధంగా జనసేన పార్టీ మేనిఫెస్టోలో చర్యలు తీసుకోవాలని వారు కోరుతూ వినతిపత్రం అందించారు. అనంతరం బొంతు రాజేశ్వరరావు మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యలను జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మరియు టీడీపీ అధ్యక్షులు చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్తానని హామీ ఇచ్చారు.