యల్లటూరు శ్రీనివాస రాజుతో ముస్లిం జనసైన్యం సమావేశం

ఉమ్మడి కడప జిల్లా రాజంపేట పట్టణం జనసేన పార్టీ కార్యాలయం(యల్లటూరు భవన్)నందు రాజంపేట జనసేన నేత యల్లటూరు శ్రీనివాస రాజుతో ఉమ్మడి కడప జిల్లా ముస్లిం జనసైన్యం(ఎం.జె.ఎస్) వ్యవస్థాపకులు గల్ఫ్ ఎన్నారై కో కన్వీనర్ ఆలీ షేక్ మరియు కమిటీ సభ్యులు సమావేశమవడం జరిగింది. రాజంపేట జనసేన పార్టీ బలోపేతం కోసం వారి ఉందు ముందు జరగబోవు కార్యాచరణను యల్లటూరు శ్రీనివాస రాజుకి వివరించి శాలువాతో సత్కరించిన కమిటీ సభ్యులు. ముస్లిం జనసైన్యం(ఎం.జె.ఎస్) కమిటీ సభ్యులు జనసేన పార్టీ బలోపేతం కోసం చేస్తున్న కృషిని అభినందించి తమ సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయని తెలిపిన యల్లటూరు శ్రీనివాస రాజు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు ఆలీ షేక్, షేక్ కరిముల్లా, గౌస్ వాజిమ్, సిరాజ్ బాష, షోయల్ మరియు రాజంపేట జనసేన నాయకులు శింగంశెట్టి నరేంద్ర, మాజీ జెడ్పీటీసి యల్లటూరు శివరామరాజు, మాజీ జెడ్పీటీసి షబ్బీర్ అహ్మద్, నాసర్ ఖాన్, భీమినేని రమేష్, గురివిగారి వాసు, రాజేష్ వర్మ తదితరులు పాల్గొన్నారు.