తెలుగు జనవిజయ కేతనం పోస్టర్ ఆవిష్కరించిన యల్లటూరు శ్రీనివాస రాజు

ఉమ్మడి కడప జిల్లా రాజంపేట పట్టణం జనసేన పార్టీ కార్యాలయం (యల్లటూరు భవన్) నందు ఈ నెల 28 న జరగబోయే తెలుగు జనవిజయ కేతనం జెండా మీకోసం మీవెంటే బహిరంగ సభకు సంబంధించిన పోష్టర్ ను ఆవిష్కరించారు రాజంపేట నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు యల్లటూరు శ్రీనివాస రాజు. ఉమ్మడి బహిరంగ సభ ను విజయవంతం చేయాలని రాజంపేట నియోజకవర్గ జనసేన నాయకులకు, జనసైనికులకు, వీరమహిళలకు పిలుపునిచ్చారు యల్లటూరు శ్రీనివాస రాజు. యల్లటూరు శ్రీనివాస రాజు ఆద్వర్యంలో రాజంపేట నుండి తాడేపల్లి గూడెం బహిరంగ సభ కు వెళ్తున్న జనసేన శ్రేణులు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు శింగంశెట్టి నరేంద్ర మాజీ జెడ్పీటీసి యల్లటూరు శివరామరాజు, మాజీ జెడ్పీటీసి షబ్బీర్ అహ్మద్, మాజీ సర్పంచ్ సమ్మెట శివప్రసాద్‌, ఆకుల చలపతి, గురివిగారి వాసు, శివ శంకర్ రాజు, పత్తి నారాయణ, నారదాసు రామచంద్ర, చిట్టే బాస్కర్, మన్నెం సుబ్బయ్య, శంకర్ రాజు, మల్లి, సాయి రాజు తదితరులు పాల్గొన్నారు.